BJP YCP Relation : ఏపీ ప్రభుత్వ ఆర్థిక కష్టాల్ని తీరుస్తున్న కేంద్రం - రాజకీయంగానూ బీజేపీ సంకేతాలు పంపినట్లేనా ?

<p>&nbsp;</p> <p><strong>BJP YCP Relation : &nbsp;</strong> ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన లోటు &nbsp;భర్తీ నిధులను కేంద్రం విడుదల చేసింది. దాదాపుగా రూ. పది వేల కోట్లకుపైగా నిధులను విడుదల చేసింది. ఇది ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి ఎంతగానో ఉపయోగపడుంది. సమస్యల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగపడతాయి. ఈ ఏడాది మీట నొక్కాల్సిన పథకాలు.. రైతు భరోసా, అమ్మఒడి వంటి వాటికి ఆ నిధులు సరిపోతాయి. అంతేనా.. ప్రతీ వారం రూ. రెండు వేల కోట్లు అప్పులకు కేంద్రం పర్మిషన్ ఇస్తోంది. దీంతో ఏపీ ప్రభుత్వం.. బటన్ నొక్కే కష్టాలు తీరిపోయినట్లేనని..వైసీపీకి బీజేపీకి ఇంత కంటే గొప్ప సాయం ఎలా చేయగలదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.&nbsp;</p> <p><strong>టీడీపీ హయాంలో ఇవ్వాల్సిన నిధులు ఇప్పుడు విడుదల&nbsp;</strong></p> <p>రాష్ట్రం ఏర్పడిన సంవత్సరంలో లోటును భర్తీ చేయాలని విభజన చట్టంలో ఉంది. ఆ మేరకు .. లోటు భర్తీ కోసం చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసిందో లెక్కేలేదు. చివరికి విసుగొచ్చేసి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చింది. కానీ ఇవ్వలేదు. ఇప్పుడు <a title="జగన్" href="https://ift.tt/ZKvV1w6" data-type="interlinkingkeywords">జగన్</a> రెడ్డి సర్కార్ కు ఆ నిధులన్నీ ఇస్తోంది. దాదాపుగా రూ. పది వేల కోట్లకుపైగా లోటు భర్తీ నిధులు రాష్ట్రానికి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఏపీ ప్రభుత్వం పండగ చేసుకోనుంది. కేంద్ర - రాష్ట్రాల మధ్య రాజ్యాంగపరమైన సంబంధాలు ఉంటాయి. వాటికి రాజకీయాలతో సంబంధం లేదు. చట్ట ప్రకారం రాష్ట్రాలకు కేటాయించాల్సిన నిధులు రాజ్యాంగపరంగా ఉంటాయి. ఆ ప్రకారం కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వాల్సిందే. విభజన చట్టంలో భాగంగా కేంద్రం లోటు &nbsp;భర్తీ చేయాల్సి ఉంది. ఆ మేరకు లోటు భర్తీని కేంద్రం చేసింది. ఏపీకి రూ. పది వేల కోట్లకుపైగా నిధుల్ని ఇచ్చింది. కానీ <a title="చంద్రబాబు" href="https://ift.tt/GiE1L0t" data-type="interlinkingkeywords">చంద్రబాబు</a> సీఎంగా ఉన్నప్పుడు ఇవ్వకుండా ఇప్పుడెందుకు ఇస్తున్నారన్నది అసలు రాజకీయవర్గాలకు వచ్చిన డౌట్&nbsp;</p> <p><strong>వైసీపీకి బీజేపీకి దూరమని ప్రజలు అనుకోవాలన్న టీడీపీ !</strong></p> <p>ఇటీవల <a title="జనసేన" href="https://ift.tt/Y3e9kfw" data-type="interlinkingkeywords">జనసేన</a> అధినేత పవన్ కల్యాణ్.. వైసీపీ విముక్త ఏపీ కోసం బీజేపీని కలుపుకుంటామని ప్రకటించారు. అంతే కాదు బీజేపీ కలిసి వస్తుందని కూడా ప్రకటించేశారు. కానీ <a title="టీడీపీ" href="https://ift.tt/9kaAfyK" data-type="interlinkingkeywords">టీడీపీ</a> మాత్రం ముందు వైసీపీకి.. బీజేపీకి దూరమని ప్రజలు అనుకోవాలన్నారు. అందు కోసం &nbsp;అడ్డగోలుగా అప్పులు ఇవ్వడం మానుకోవాలని .. &nbsp; సహకరించడం ఆపేయాలన్నారు. కానీ అనూహ్యంగా గత ప్రభుత్వంలో ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వడంతో ఇప్పుడు వైసీపీకి..బీజేపీ మరింత దగ్గరన్న వాదన వినిపించడానికి ఎక్కువ అవకాశం ఏర్పడింది.&nbsp;</p> <p><strong>రాజకీయానికి సంబంధం &nbsp;లేదంటున్న ఏపీ బీజేపీ ! &nbsp;</strong></p> <p>అయితే &nbsp;భారతీయ జనతా పార్టీకి రాష్ట్రం ముఖ్యమని..ఎవరు అధికారంలో ఉన్నారన్నది కాదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. &nbsp; గత తొమ్మిది సంవత్సరాల్లో ఏపీ ప్రయోజనాల కోసం దాదాపు 3 లక్షల కోట్లు బిజెపి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్&zwnj;కి ఇచ్చిందని &nbsp;గుర్తు చేశారు. &nbsp;రాజకీయాల కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై వివక్ష చూపదని తాజాగా ఇచ్చిన నిధుల ద్వారా స్పష్టమయిందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అంటున్నారు. &nbsp; రాష్ట్రానికి ఇచ్చిన నిధుల పట్ల రాజకీయం చేయడం రాష్ట్ర ప్రయోజనాలకు ద్రోహం చేయడమేనని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి అన్నారు. నిధులు ఇవ్వడం లేదని ఇంత కాలం నిందలు వేశారని.. &nbsp;ఇప్పుడు ఇచ్చారని అనడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. &nbsp;<br />&nbsp;&nbsp;<br />బీజేపీ నేతలు ఎలా సమర్థించుకున్నా.. ప్రస్తుతం అటు ఆర్థికంగా.. ఇటు కేసుల పరంగా జరుగుతున్న పరిణామాలు చూస్తే.. బీజేపీకి &nbsp;వైసీపీకి దగ్గరే అన్న భావన బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇతర పార్టీలు ప్రయత్నిస్తాయి. మరి ..<a title="బీజేపీ" href="https://ift.tt/Dd7CfNS" data-type="interlinkingkeywords">బీజేపీ</a>ని కలుపుకోవాలనుకుంటున్న <a title="పవన్ కల్యాణ్" href="https://ift.tt/UW5oONR" data-type="interlinkingkeywords">పవన్ కల్యాణ్</a> ప్రస్తుత పరిస్థితులపై ఎలా స్పందిస్తారో ?</p>

from news https://ift.tt/gtNuiXZ

కామెంట్‌లు లేవు